World Cup | ఈ ఏడాది భారత్ వేదిక ఐసీసీ ప్రపంచకప్ జరుగనున్నది. ఇప్పటికే టోర్నీ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 19న ఫైనల్ జరుగనున్నది. భారత్లోని పది నగరాల్లో ప్రపంచకప్ జరుగనుండగా.. పలు మ్యాచులకు సంబంధించి షెడ్యూల్ మారే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని తాజాగా బీసీసీఐ కార్యదర్శి జైషా ధ్రువీకరించారు. భారత్ – పాక్ మ్యాచ్లో సైతం మార్పు జరుగనున్నది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరుగాల్సి ఉంది.
అదే రోజు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా సంస్థలు భారత్ – పాక్ మ్యాచ్ తేదీని మార్చాలని బీసీసీఐని కోరారు. ఈ విషయంపై బోర్డు సైతం సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు దాయాదుల పోరు అక్టోబర్ 14న జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈ మ్యాచ్తో పాటు మరికొన్ని మ్యాచులకు సంబంధించి షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. దీనిపై నేడో రేపే అధికారికంగా బీసీసీఐ ప్రకటించే అవకాశాలున్నాయి.
అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో (చెన్నై)
అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్తో (ఢిల్లీ)
అక్టోబర్ 14న పాకిస్థాన్తో (అహ్మదాబాద్)
అక్టోబర్ 19న బంగ్లాదేశ్తో (పూణే)
అక్టోబర్ 22న న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29 ఇంగ్లాండ్తో (లక్నో)