TeamIndia : శ్రీలంకతో చివరిదైన మూడో వన్డే కోసం భారత జట్టు తిరువనంతపురం చేరుకుంది. టీమ్ బస్సు దిగి హోటల్కు వెళ్లిన ఆటగాళ్లకు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం లభించింది. కథాకళి నృత్యకారులతో పాటు కొందరు కేరళ సంప్రదాయ వేషధారణలో డోలు వాయిస్తూ టీమిండియాకు వెల్ కమ్ చెప్పారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. జనవరి 15న (ఆదివారం) గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1ః30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. రెండు విజయాలతో భారత్ సిరీస్ను గెలుచుకుంది. తొలి వన్డేలో 67 రన్స్ తేడాతో, రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దాంతో నామమాత్రమైన మూడో వన్డేలో ఇండియా రిజర్వ్ బెంచ్ను పరీక్షించే అవకాశం ఉంది.
పద్మనాభస్వామి ఆలయంలో..
అనంతరం కొందరు ఆటగాళ్లు కేరళలో పాపులర్ అయిన అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లారు. సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్లు పద్మనాభస్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం పంచెలు కట్టుకున్న వీళ్లంతా ఆలయ సిబ్బందితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
Hello Trivandrum 👋🏻
We are here for the 3️⃣rd and final #INDvSL ODI ✅#TeamIndia pic.twitter.com/xzpr7UTCMT
— BCCI (@BCCI) January 13, 2023
Indian players visited Padmanabhaswamy Temple at Trivandrum. pic.twitter.com/S21VxIyGAh
— Johns. (@CricCrazyJohns) January 14, 2023