ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణించాడు. తన జట్టుకు మంచి ఓపెనింగ్ అందిస్తూనే వచ్చాడు. ఈ క్రమంలోనే వరుసగా మూడో టెస్టులో కూడా విజయం సాధించిన ఆసీస్ జట్టు.. యాషెస్ సిరీస్ను కైవసం చేసుకుంది. ఇలా సిరీస్ గెలుచుకున్న తర్వాత వార్నర్ రిటర్మెంట్పై ప్రశ్నలు తలెత్తాయి.
35 ఏళ్ల వార్నర్ కొంతకాలం ఫామ్ లేమితో ఇబ్బందులు పడ్డాడు. ఈ సమయంలోనే ఐపీఎల్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్.. అతన్ని జట్టులో నుంచి తొలగించింది. అయితే ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన వార్నర్.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.
అదే ఫామ్ను ప్రస్తుతం యాషెస్ సిరీస్లో కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్పై స్పందించిన వార్నర్.. భారత్ను భారత్లోనే ఓడించి సిరీస్ గెలుచుకోవాలని, అలాగే ఇంగ్లండ్లో యాషెస్ సిరీస్ నిలబెట్టుకోవాలని తనకున్నట్లు వెల్లడించాడు.
రిటైర్మెంట్ కన్నా ముందు ఈ రెండు సాధించాలని ఉన్నట్లు తెలిపాడు. వయసు మీదపడుతున్న విషయంపై కూడా మాట్లాడుతూ.. ’ప్రస్తుతం జేమ్స్ ఆండర్సన్ మా వంటి సీనియర్ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మాకు వయసు పెరిగేకొద్దీ మేం అతన్ని చూసే స్ఫూర్తి పొందుతాం‘ అని చెప్పాడు.