హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అతిపిన్న వయస్కుడైన చెస్ ప్లేయర్ విష్ణునాగ నెమల నోబుల్ వరల్డ్ రికార్డు సాధించాడు. మైస్కేప్ విల్లాకోర్టు యార్డ్లో సోమవారం నోబుల్ వరల్డ్ రికార్డుకోసం నిర్వహించిన ఈవెంట్లో చెస్బోర్డుపై ఏకకాలంలో 25 మంది ఆటగాళ్లతో విష్ణునాగ చెస్ ఆడాడు. ఈ క్రమంలో గంటన్నర సమయంలో అటామిక్ చెస్ గేమ్ను పూర్తి చేసి నోబుల్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ చొక్కలింగం బాలాజీ ఈ ఈవెంట్ను పర్యవేక్షించారు.
అద్భుత ప్రతిభ కనబరిచిన విష్ణునాగను లయన్ గోవిందరాజులు, లయన్ రామానుజాచార్యులు, లయన్ శ్రీనివాసులు సర్టిఫికేట్తో పాటు మెడల్, మెమొంటో అందించారు. నోబుల్ వరల్డ్ రికార్డు సాధించిన విష్ణునాగను రాయ్చెస్ అకాడమీ డైరెక్టర్లు రాజశేఖర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, దివ్య అభినందించారు. తమ సంస్థలో శిక్షణ పొందిన విష్ణునాగ నోబుల్ వరల్డ్ రికార్డు సాధించడం ఆనందంగా ఉందన్నారు.