CWC 2023: వన్డే వరల్డ్ కప్లో వరుసగా పది మ్యాచ్లలో గెలిచి ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో దెబ్బతినడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా ఓటమితో నిరాశకు గురైన అభిమానులు ఆగ్రహావేశాలతో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పలువురు వీరాభిమానులు తమ జట్టు ఓటమిని చూడలేక ఆస్ట్రేలియా ఆటగాళ్ల భార్యలను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్కు దిగుతున్నారు. ఫైనల్లో ఆసీస్కు విజయాన్ని అందించిన ట్రావిస్ హెడ్ భార్యతో పాటు రోహిత్ శర్మ వికెట్ తీసిన స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్వెల్ భార్యలపై దుర్బాషలాడుతూ పోస్టులు పెడుతున్నారు.
ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా, మ్యాక్స్వెల్ వైఫ్ విని రామన్ ఇందుకు సంబంధించి తమ ఇన్స్టాగ్రామ్లలో తమపై వచ్చిన అభ్యంతరకర సందేశాలు, ట్రోల్స్పై విచారం వ్యక్తం చేశారు. భారత సంతతి అమ్మాయి అయిన విని రామన్పై చేసిన ట్రోలింగ్ పై ఆమె స్పందించింది. ప్రపంచంలో మరెన్నో సమస్యలున్నాయని, ట్రోలర్స్ తమ దృష్టిని వాటివైపునకు మరలిస్తే మంచిదని సలహాఇచ్చింది.
Instagram post of Glenn Maxwell’s wife, Vini Raman. pic.twitter.com/1QAzwdndKk
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023
This too with head wife pic.twitter.com/gHpxvnbzPW
— Khurram🇵🇰 (@KhurramRANA21) November 20, 2023
జిమ్మీని వదలలేదు..
Some Indian cricket fans keeping the bharatiya samskaram
These are IG stories by Jimmy Neesham. pic.twitter.com/fhEt5s0BcA
— Jimy (@jimypothen) November 20, 2023
ఇండియా – ఆసీస్ ఫైనల్ మ్యాచ్తో ఎటువంటి సంబంధం లేని కివీస్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ను కూడా ట్రోలర్స్ వదల్లేదు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత నీషమ్ ఇన్స్టా స్టోరీస్లో ‘ నిన్న రాత్రి మ్యాచ్ చూడలేదు. కానీ ఆసీస్ గెలిచిందనుకుంటా’ అని పోస్ట్ పెట్టాడు. దీంతో పలువురు అభిమానులు నీషమ్ను కూడా ట్రోల్ చేశారు. ట్రోలర్స్పై నీషమ్ కూడా గట్టిగానే స్పందించాడు. మిడిల్ ఫింగర్ చూపుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు రెండు దేశాలని తెలియనివాళ్లకు ఇదే నా సమాధానం’ అంటూ కామెంట్ చేశాడు.