బెంగళూరు : టాప్ సీడ్ బ్రెండా ఫ్రవిర్తోవా ఐటీఎఫ్ ఓపెన్ మహిళల టెన్నిస్ టైటిల్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో బ్రెండా 0-6, 6-4, 6-0తో ఇండియాకు చెందిన అంకిత రైనాను ఓడించింది. ప్రపంచ 163వ ర్యాంకర్ బ్రెండా తొలి సెట్లో ఏమాత్రం ప్రతిఘటన ఇవ్వలేకపోయింది.
నాలుగు డబుల్ఫాల్ట్లు చేయడమేగాక లెక్కలేనన్ని అనవసర తప్పిదాలకు పాల్పడింది. రెండో సెట్ ఆరంభంలోనూ 0-3తో వెనుకబడింది. అయిదో గేమ్లో బ్రేక్తో బ్రెండా ఆటతీరు మారిపోయింది. అక్కడినుంచి ఎదురుదాడికి దిగి రెండో సెట్తో సెట్ స్కోరు సమం చేసి నిర్ణయాత్మక మూడో సెట్లో ఒక్క గేమ్నుకూడా కోల్పోకుండా రైనాను ఇంటిదారి పట్టించింది.