మలక్పేట: మలక్పేటలోని హైదరాబాద్ రేస్ క్లబ్ వేదికగా ఆదివారం వోల్ఫ్777 గోల్కొండ డెర్బీ స్టేక్స్ రేసు జరుగబోతున్నది. మొత్తం పది మంది జాకీలు ఇందులో పోటీపడుతున్నారని రేస్క్లబ్ బోర్డు డైరెక్టర్లు ఎన్వీఆర్ఎన్ రెడ్డి, పీఎస్ రెడ్డి, మనీశ్ జైస్వాల్ శనివారం మీడియా భేటీలో పేర్కొన్నారు. ఈ రేసులో విజేతకు కోటి రూపాయల ప్రైజ్మనీగా నిర్ణయించినట్లు తెలిపారు.