బెంగళూరు: దులీప్ ట్రోఫీలో వెస్ట్, నార్త్ జోన్ మధ్య జరుగుతున్న రెండో క్వార్టర్స్ పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడుతున్న వేళ.. గెలుపునకు వెస్ట్జోన్కు 67 పరుగులు అవసరమవగా నార్త్కు 3 వికెట్లు కావాలి. ఈ నేపథ్యంలో ఆట ఆఖరి రోజైన బుధవారం ఎవరిని విజయం వరిస్తుందనేది ఆసక్తికరం.
మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 107/4తో ఆట ఆరంభించిన నార్త్.. 222 రన్స్కు ఆలౌటై ప్రత్యర్థి ఎదుట 287 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఛేదనలో రుతురాజ్ గైక్వాడ్ సేన ఆట ముగిసే సమయానికి 220/7తో నిలిచింది. ముషీర్ ఖాన్ (96), రుతురాజ్ (66) రాణించారు. ఉర్విల్ పటేల్ (17 బ్యాటింగ్), తనుష్ కొటియాన్, శార్దూల్ ఠాకూర్ ఉండటంతో విజయంపై వెస్ట్ భరోసాగా ఉంది. ఇక నార్త్ఈస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్లో ఈస్ట్జోన్ ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్కు చేరింది.