హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఎస్ఎఫ్ఐ జాతీయ స్విమ్మింగ్ ఓపెన్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మహిళల 800మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన వ్రితి 9ని.38.78 సెకన్ల టైమింగ్తో పసిడి పతకాన్ని ముద్దాడింది. అశ్మిత చంద్ర, అమిత్ర కుమార్ రజత, కాంస్యాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు 200మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లో వ్రితి 2ని.28.13 సెకన్ల టైమింగ్తో టాప్లో నిలిచింది. లవ్లీన్దాస్, విజయ్శ్రీ రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.