బెంగళూరు: బౌలర్లు సత్తాచాటడంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు కోలుకుంది. కెప్టెన్ హనుమ విహారి (63), తిలక్ వర్మ (40) మినహా తక్కిన వాళ్లంతా విఫలమవడంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 213 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 129/7తో నిలిచింది. ఓపెనర్ పృథ్వీ షా (65) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. పుజారా (9), సూర్యకుమార్ (8), సర్ఫరాజ్ (0) విఫలమయ్యారు. సౌత్ బౌలర్లలో విద్వత్ 4, విజయ్కుమార్ రెండు వికెట్లు పడగొట్టారు. చేతిలో 3 వికెట్లు ఉన్న వెస్ట్ జోన్.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 84 పరుగులు వెనుకబడి ఉంది.