ముంబై : భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్లో వాటాదారుగా అవతరించాడు. పేస్ లీగ్లోని బెంగాల్ ఫ్రాంచైజీలో వాటాలను కొనుగోలు చేశాడు. టెన్నిస్ ప్రీమియర్ లీగ్లో ఎనిమిదో జైట్టెన బెంగాల్ యాజమాన్యం వార్డ్విజార్డ్ గ్రూపుతో పేస్ చేతులు కలిపాడు.
ముంబై లియోన్ ఆర్మీ, పంజాబ్ టైగర్స్, పుణె జాగ్వార్స్, బెంగళూరు స్పార్టన్స్, ఢిల్లీ బిన్నీస్ బ్రిగేడ్, హైదరాబాద్ స్ట్రైకర్స్, గుజరాత్ పాంథర్స్ లీగ్లోని ఇతర ఫ్రాంచైజీలు. డిసెంబర్లో నిర్వహించనున్న అయిదో సీజన్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ పోటీలు పుణెలోని బలెవాడి స్టేడియంలో నిర్వహిస్తారు. తొలి సీజన్లో సీ హాక్స్ విజేతగా నిలవగా, పుణె జాగ్వార్స్ రెండో సీజన్ను గెలుచుకుంది.