హైదరాబాద్: మహిళల జాతీయ సీనియర్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో తెలంగాణ 81-78 తేడాతో కేరళపై అద్భుత విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో తెలంగాణ…భారత రైల్వేస్ జట్టుతో తలపడుతుంది. మ్యాచ్ విషయానికొస్తే కేరళతో జరిగిన సెమీస్ పోరులో మన అమ్మాయిలు అద్భుత పోరాటపటిమ కనబరిచారు. మ్యాచ్లో ప్రియాంక(33), అశ్వతి(20),అంబరసి(16), కిరణ్(7) సత్తాచాటారు. కేరళను ఒత్తిడిలోకి నెడుతూ కీలక పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. జాతీయ టోర్నీలో తెలంగాణ జట్టు ప్రదర్శనను సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి అభినందించారు.