సౌతాంప్టన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఇంగ్లండ్లో అడుగుపెట్టాక తొలిసారి జట్టు సభ్యులందరూ బృందంగా గురువారం ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. మూడు రోజుల కఠిన క్వారంటైన్ ముగిసిన ఈనెల ఆరో తేదీ నుంచి ఆటగాళ్లు వ్యక్తిగతంగా కసరత్తులు చేయగా.. ఇప్పుడు బృందంగా ప్రాక్టీస్ చేసేందుకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. కోహ్లీసేన ప్రాక్టీస్ చేసిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పుజార, పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్లో చెమటోడ్చారు. ప్రధాన బౌలర్లు ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా, సిరాజ్, అశ్విన్ నెట్స్లో బంతులు సంధించారు. ఈనెల 18 నుంచి 22 వరకు జరుగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్తో టీమ్ఇండియా తలపడనుంది.