Team India | రాజ్కోట్: టీమ్ఇండియా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం నుంచి రాంచీ వేదికగా.. నాలుగో టెస్టు ప్రారంభం కానుండగా.. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉంది. మహమ్మద్ షమీ గైర్హాజరీలో పేస్ భారాన్ని మోస్తున్న బుమ్రా.. మూడు మ్యాచ్ల్లో కలిపి 81 ఓవర్లు వేసి 17 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.
ఐదో మ్యాచ్ జరగనున్న ధర్మశాల పిచ్ పేస్కు అనుకూలించనున్న నేపథ్యంలో.. వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా జస్సీకి రెస్ట్ ఇవ్వాలని చూస్తున్నది. ‘మంగళవారం జట్టు సభ్యులంతా రాంచీ వెళ్తారు. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వొచ్చు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. మరోవైపు గాయం కారణంగా గత రెండు మ్యాచ్లకు దూరమైన సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు నాలుగో టెస్టులో బరిలోకి దిగడం ఖాయమే.