హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్లో కాంస్య పతకంతో మెరిసిన రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ను జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు సోమవారం అభినందించారు.
హుసామ్ను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది తెలంగాణ యువకులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాలని ఆయన ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్లేయర్లకు ఇస్తున్న ప్రోత్సాహానికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు.