Pooja Nithlekar | జూబ్లీహిల్స్: పటియాల(పంజాబ్) వేదికగా ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 5 వరకు జరుగనున్న జాతీయస్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్నకు రాష్ట్ర యువ రెజ్లర్ పూజ నిత్లేకర్ ఎంపికైంది. రాష్ట్ర అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్లో జరిగిన అండర్-15 రాష్ట్ర స్థాయి టోర్నీలో పసిడి పతకం సాధించం ద్వారా పూజ నేషనల్ టోర్నీకి ఎంపికైంది.
నగరంలోని ఎర్రగడ్డకు చెందిన పూజ ప్రస్తుతం యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నది. జాతీయ టోర్నీలో బాలికల అండర్-15 విభాగంలో ఈ యువ రెజ్లర్ బరిలోకి దిగనుంది.