కొత్తపల్లి: రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్-13 చెస్ చాంపియన్షిప్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ డెమాక్రటిక్ చెస్ డెవలప్మెంట్ కమిటీ (టీడీసీడీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ను జడ్పీ సీఈవో ప్రియాంక కర్ణన్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో 31 జిల్లాలకు చెందిన సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించనున్నట్లు పోటీల నిర్వాహకులు కంకటి అనూప్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమీర్, అమిత్ పాల్సింగ్, కంది రవి, అనిత తదితరులు పాల్గొన్నారు.