హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐ-లీగ్ ఫుట్బాల్ చాంపియన్షిప్లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ హవా కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన పోరులో శ్రీనిధి 2-0తో రాజస్థాన్ జట్టుపై ఘనవిజయం సాధించింది. శ్రీనిధి డెక్కన్ తరఫున అశీర్ అక్తర్ (5వ నిమిషంలో), లాల్రోమా (37వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. తొలి అర్ధభాగంలో శ్రీనిధి రెండు గోల్స్ చేయగా.. ప్రత్యర్థి జట్టు స్కోర్లు సమం చేసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇక రెండో అర్ధభాగంలో లీడ్ను కాపాడుకున్న డెక్కన్ టీమ్ విజయ దుందుభి మోగించింది. ఈ విజయంతో ఐ-లీగ్ పాయింట్ల పట్టికలో శ్రీనిధి టాప్ ప్లేస్కు చేరుకుంది. ఇప్పటి వరకు లీగ్లో 17 మ్యాచ్లాడిని శ్రీనిధి జట్టు 37 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.