టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో రికార్డు సృష్టించాడు. ఈ ఏడాదిలో టి20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో వెయ్యి పరుగులు చేసిన మొదటి భారత బ్యాటర్గా నిలిచాడు సూర్య. సూపర్-12లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 61 పరుగులు చేయడంతో ఈ ఏడాది 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉన్న సూర్య పొట్టి ప్రపంచకప్లో అదరగొడుతున్నాడు. వరుసగా అర్థ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
టి 20 నెంబర్ 1 బ్యాటర్
టీ 20 ఫార్మాట్లో పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ తర్వాత ఒక ఏడాదిలో వెయ్యికి పైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 28 టీ 20 మ్యాచ్లు ఆడిన సూర్య 1,026 పరుగులు చేశాడు. 44.60 సగటు, 186.54 స్ట్రైక్రేట్తో ఆడుతున్న సూర్య ప్రస్తుతం టీ 20ల్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. ఈమధ్యే రిజ్వాన్ని వెనక్కి నెట్టి, అగ్రస్థానానికి చేరుకున్నాడు సూర్య.