చెన్నై: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలయ్యే తుది పోరులో తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్.. ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఈస్ట్ జోన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇటీవల లంక సిరీస్లో రెండు సెంచరీలతో మెరిసిన దేవదత్ పడిక్కల్, సెమీస్లో అజేయ శతకం, అర్ధ శతకం సాధించిన సౌత్ జోన్ కెప్టెన్ తిలక్కు తోడు హైదరాబాద్ స్పీడ్స్టర్ మహ్మద్ సిరాజ్ రాకతో సౌత్ టీమ్ బలంగా కనిపిస్తోంది.
కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోయినా.. పడిక్కల్, తిలక్ తమ ఫామ్ కొనసాగించాలని భావిస్తున్నారు. న్యూజిలాండ్ పర్యటనకు ముందు సిరాజ్ తన బౌలింగ్ లయను తిరిగి అందుకోవడంపై దృష్టి పెట్టాడు. ఇక, ఈస్ట్ జోన్లో ఇషాన్, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫామ్లో ఉన్నా రు. ఆ జట్టుకు ఆడుతున్న వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కి ఇది వందో ఫస్ట్-క్లాస్ మ్యాచ్ కా వడం విశేషం.