కొలంబో: భారత్తో జరుగుతున్న రెండో టెస్టు(SLvIND)లో.. శ్రీలంక తన మొదటి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో 213 పరుగులు వెనుకబడి ఉన్న శ్రీలంక ఫాలోఆన్ ఆడుతోంది. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, మానవ్ సుతార్లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. అయితే లంక బ్యాటర్లు ఈ సిరీస్లో విఫలం అవుతున్నారు. కేవలం సోనల్ దినుషా మాత్రమే రాణించాడు. ఈ సిరీస్లో అతను రెండో సెంచరీ నమోదు చేశాడు. ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ దినుషా సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక కొలంబోలో అతను సెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రీలంకను ఫాలోఆన్ ప్రమాదం నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు. దినుషా 147 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. 103 రన్స్ చేసిన దినుషా .. చివరి వికెట్ రూపంలో నిష్క్రమించాడు.
Sri Lanka all-out for 290 in the 1st innings!
3⃣ wickets each for Prasidh Krishna & Manav Suthar
2⃣ wickets for Saransh Jain
1⃣ wicket each for Mohammed Siraj & Ravindra Jadeja#TeamIndia have enforced the follow-on!Scorecard ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/6e0sgqR8j5
— BCCI (@BCCI) August 26, 2026