హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ అదరగొడుతున్నది. గువాహటి వేదికగా జరుగుతున్న 75వ జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో వ్రితి వెండి వెలుగులు విరజిమ్మింది. గురువారం జరిగిన మహిళల 1500మీటర్ల ఫ్రీైస్టెల్ రేసులో అగర్వాల్ రజత పతకం సొంతం చేసుకుంది. భవ్య సచ్దేవా, రిచా మిశ్రా వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. టోర్నీలో వ్రితికి ఇది రెండో రజతం కావడం విశేషం.