అడిలైడ్: ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్కు ముందు జరుగుతున్న అడిలైడ్ ఇంటర్నేషనల్ టోర్నీ పురుషుల డబుల్స్లో భారత ఆటగాళ్లు రామ్కుమార్ రామ్నాథన్-రోహన్ బోపన్న సెమీఫైనల్కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన ఏటీపీ-250 డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రామ్కుమార్-బోపన్న జోడీ 6-1, 6-3తో బెంజమిన్ బోన్జీ (ఫ్రాన్స్)-హుగో నైస్ (మొనాకో)పై విజయం సాధించింది. మహిళల సెమీస్లో సానియా-నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ 1-6, 6-2, 8-10 ఆష్లే బార్టీ-స్ట్రోమ్ సాండర్స్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది.