హరారే: జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ను గిల్ నేతృత్వంలోని టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన రింకూ సింగ్(Rinku Singh)కు ఫీల్డర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. తన ఎక్స్ అకౌంట్లో బీసీసీఐ దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. ఫీల్డింగ్ కోచ్ సుభాదీప్ ఘోష్.. సిరీస్లో ఫీల్డింగ్ గురించి మాట్లాడారు.
భారత క్రికెట్ జట్టులో ఫీల్డింగ్ చాలా కీలకమైందని, చాలా ఉన్నత ప్రమాణాలతో క్రికెటర్లు ఫీల్డింగ్ చేస్తున్నారని, ఈ రంగంలో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాలని, సంప్రదాయం ప్రకారం ఫీల్డింగ్ మెడల్ ఇస్తామని, ఫీల్డింగ్ ద్వారా ప్రభావాన్ని చూపిన ఆటగాడికి ఫీల్డర్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కుతుందని దిలీప్ తెలిపాడు.
జింబాబ్వేతో సిరీస్లో ఫీల్డర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు రింకూ సింగ్కు దక్కుతుందని ఘోష్ ప్రకటించారు. కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ చేతుల మీదుగా రింకూకు అవార్డును అందజేశారు. అందరితో ఆడడం ఎంజాయ్ చేశానని, ఇది నాకు అయిదో సిరీస్ అని, దీన్ని బాగా ఎంజాయ్ చేశానని, బ్యాటింగ్-ఫీల్డింగ్ను ఇష్టపడుతానని రింకూ తెలిపాడు.