ఈ ఐపీఎల్లో తడబడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. తమ చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ రెండు జట్లు చివరగా ఆడిన మ్యాచ్లో చెన్నై విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా గెలవాలని బెంగళూరు పట్టుదలగా ఉంది.
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. జట్టులో మిచెల్ శాంట్నర్ స్థానంలో మొయీన్ అలీ ఆడుతున్నట్లు ధోనీ వెల్లడించాడు. బెంగళూరు జట్టులో ఎలాంటి మార్పులూ లేవని డుప్లెసిస్ చెప్పాడు. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నామని వెల్లడించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జోష్ హాజిల్వుడ్
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, మొయీన్ అలీ, డ్వెయిన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, సిమర్జీత్ సింగ్, ముకేష్ చౌదరి