మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్ సారధ్యంలో కొత్త ప్రయాణం ప్రారంభించనుంది. మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవుతుందనగా.. ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన అభిమానులకు షాకిచ్చాడు. జట్టు కెప్టెన్సీకి గుడ్బై చెప్పేసి ఆ పగ్గాలను రవీంద్ర జడేజాకు అందించాడు.
ఈ విషయాన్ని సీఎస్కే జట్టు యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ జడేజా ఏమనుకుంటున్నాడు? అనే విషయాన్ని కూడా సీఎస్కే బయటపెట్టింది. జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో.. జడ్డూను కొత్త బాధ్యతల గురించి ప్రశ్నించింది.
‘‘చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో నేను చాలా పెద్ద గ్యాప్ను పూడ్చాల్సి ఉంటుందని తెలుసు. మహీ భాయ్ గొప్ప లెగసీ సృష్టించాడు. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాపై ఉంది’’ అని జడ్డూ చెప్పాడు. అలాగే ధోనీ పక్కనే ఉంటాడు కాబట్టి, తనకు కెప్టెన్సీ విషయంలో ఎలాంటి వర్రీ లేదని స్పష్టం చేశాడు.
‘‘నాకు ఎటువంటి అనుమానాలు ఉన్నా సరే.. కచ్చితంగా తన దగ్గరకే వెళ్తాను. నాకు ఎలాంటి సమస్య ఎదురైనా నేను తన దగ్గరకే వెళ్లేవాడిని, ఇకపై వెళ్తాను కూడా. అందుకే నాకు పెద్ద కంగారేం లేదు. మాకు అభిమానుల నుంచి వచ్చే మద్దతు ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.
అయితే జడ్డూకు కెప్టెన్సీ ఇవ్వడం వెనుక ధోనీ పెద్ద ప్లానే వేశాడని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ధోనీ తర్వాతి ఐపీఎల్ నుంచి ఆటకు దూరమవుతాడని, అందుకే ఈ సీజన్లో జడ్డూను కెప్టెన్ చేసి, అతనికి బాధ్యతలు అప్పగిస్తున్నాడని వాళ్లు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది జరిగే ఐపీఎల్లో కూడా ధోనీ అన్ని మ్యాచులూ ఆడకపోవచ్చని, కొన్ని మ్యాచుల్లో తను లేకుండా పూర్తిగా జడ్డూకే బాధ్యత అప్పగించేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ధోనీ మనసులో ఏముందో వచ్చే ఐపీఎల్లో కానీ తెలియదు.
📹 First reactions from the Man himself!#ThalaivanIrukindran 🦁💛 @imjadeja pic.twitter.com/OqPVIN3utS
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022