హైదరాబాద్, ఆట ప్రతినిధి: మస్కట్లో జరిగే డబ్ల్యూటీటీ యూత్ టోర్నీకి రాష్ట్ర యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ బీ వరుణ్ శంకర్ ఎంపికయ్యాడు. ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, ఆకుల శ్రీజ తర్వాత రాష్ట్రం నుంచి దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్న మూడో ప్లేయర్గా శంకర్ నిలిచాడు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం సోమ్నాథ్ ఘోష్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న శంకర్..మస్కట్ టోర్నీలో సత్తాచాటుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.