న్యూయార్క్: భారత నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో రెండో రౌండ్కు చేరాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి రౌండ్లో ప్రజ్నేశ్ 6-4, 7-6 (7/5)తో బ్రైడెన్ షునర్ (కెనడా)పై విజయం సాధించాడు. గంటా 37 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రపంచ 156వ ర్యాంకర్ గుణేశ్వరన్ వరుస సెట్లలో విజృంభించాడు. రెండో రౌండ్లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ యుబాంక్స్తో 31 ఏండ్ల గుణేశ్వరన్ తలపడనున్నాడు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో ఇప్పటికే రామ్కుమార్ రామనాథన్, సుమిత్ నాగల్ పరాజయం పాలవగా.. మహిళల విభాగంలో అంకిత రైనా తొలి రౌండ్ ఓటమితో ఇంటిబాట పట్టింది. ప్రస్తుతం భారత్ నుంచి ప్రజ్నేశ్ ఒక్కడే పోటీలో ఉన్నాడు.