న్యూఢిల్లీ: మెన్స్ హాకీ ఒలింపిక్ మెడల్ గెలిచిన ఇండియన్ జట్టుతో ప్రధాని మోదీ ( PM Modi) ఫోన్లో మాట్లాడారు. టోక్యో ఒలింపిక్స్లో జర్మనీతో జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో నెగ్గిన భారత జట్టుకు ప్రధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన కెప్టెన్ మన్ప్రీత్ సింగ్కు ఫోన్ చేశారు. చాలా అద్భుతంగా ఆడారంటూ ప్లేయర్లను మోదీ కీర్తించారు. మీ దీవెనలు మమ్మల్ని గెలిపించినట్లు మన్ప్రీత్ తెలిపారు. సెమీస్ తర్వాత కూడా మోదీ ఫోన్ చేశారు. ఆ విషయాన్ని మన్ప్రీత్ గుర్తు చేస్తూ.. మీరు ఇచ్చిన మోటివేషన్ పనిచేసిందన్నారు. 41 ఏళ్ల తర్వాత మళ్లీ మెన్స్ హాకీలో ఇండియాకు మెడల్ వచ్చింది. భారత కోచ్ గ్రహమ్ రీడ్, అసిస్టెంట్ కోచ్ పీయూష్ దూబేలతోనూ మోదీ మాట్లాడారు. వారిని ఆయన అభినందించారు. టోక్యోలో డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లు ఉన్న సమయంలో మోదీ ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాల్ను వీడియో తీశారు. దానికి సంబంధించిన వీడియోను చూడండి.
#WATCH | PM Narendra Modi speaks to the India Hockey team Captain Manpreet Singh, coach Graham Reid and assistant coach Piyush Dubey after the team won #Bronze medal in men's hockey match against Germany#TokyoOlympics pic.twitter.com/NguuwSISsV
— ANI (@ANI) August 5, 2021