లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ కూడా తడబడుతోంది. మయాంక్ అగర్వాల్ (25), శిఖర్ధవన్ (6) తర్వాత కీలకమైన రాజపక్స (9) కూడా పెవిలియన్ చేరాడు. కృనాల్ పాండ్యా వేసిన 8వ ఓవర్ చివరి బంతికి రాజపక్స అవుటయ్యాడు. పాండ్యా వేసిన బంతిని లెగ్ సైడ్ పంపడానికి రాజపక్స ప్రయత్నించాడు.
అయితే బంతి టైమింగ్ను సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచి కవర్స్ వైపు వెళ్లింది. బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పూర్తి చేశాడు. దీంతో రాజపక్స పెవిలియన్ చేరాడు. ఎనిమిది ఓవర్ల తర్వాత 58 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ కష్టాల్లో పడింది.