IPL 2022 Auction: గతంలో అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచిన ఓ క్రికెటర్ తాజా ఐపీఎల్ వేలంలో తక్కువ ధరకు అమ్ముడు పోయాడు. గతంలో రూ.9.25 కోట్లు పలికిన అతని ధర ఇప్పుడు కేవలం రూ.90 లక్షలకు పరిమితమైంది. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ కేవలం రూ.90 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. మరి ఆ ప్లేయర్ ఎవరో కాదు ఇప్పటివరకు మూడు ఐపీఎల్ సీజన్లలో ఆడిన కృష్ణప్ప గౌతమ్.
కృష్ణప్ప గౌతమ్ను గతంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ను అంత ధర వెచ్చించి కొనుగోలు చేయడం ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు. అయితే, ఐపీఎల్ లో అతని ప్రదర్శన మాత్రం అత్యంత పేలవంగా ఉన్నది. మొత్తం 24 మ్యాచ్లు ఆడిన గౌతమ్ కేవలం 13 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అదేవిధంగా 14.30 సగటుతో కేవలం 186 పరుగులు మాత్రమే చేశాడు.
పైగా గత సీజన్లో కృష్ణప్ప గౌతమ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో అతని ధర అమాంతం పడిపోయింది. అతని బేసిక్ ధర రూ.50 లక్షలుగా నిర్ణయించగా ఆర్సీబీ రూ.90 లక్షలకు దక్కించుకుంది.
ఇదిలావుంటే, గౌతమ్ 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ. 6.20 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం 15 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు తీశాడు.
అయితే, 2019 సీజన్లో 7 మ్యాచ్లు ఆడి కేవలం ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. 2020 సీజన్లో 2 మ్యాచ్లు ఆడి ఒక వికెట్ తీశాడు. 2021 సీజన్లో అసలు ఆడనే లేదు. కృష్ణప్ప గౌతమ్ బ్యాటింగ్లో కూడా పెద్దగా ఆటతీరును ప్రదర్శిచలేకపోయాడు. గౌతమ్కు టీ20లలో మొత్తం 67 మ్యాచ్లు ఆడి 48 వికెట్లు పడగొట్టాడు.