న్యూఢిల్లీ: అల్టిమేట్ ఖో ఖో లీగ్(యూకేకే) రెండో సీజన్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఒడిశా వేదికగా వచ్చే నెల 24వ తేదీన మొదలై జనవరి 13 వరకు జరుగనున్నాయి. కటక్లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది. భవిష్యత్ కోసం యువత అనే దార్శనికతతో స్ఫూర్తి పొందిన ఒడిశా ప్రభుత్వం పలు ప్రతిష్ఠాత్మక టోర్నీలకు వేదికగా నిలుస్తున్నది. ఔత్సాహిక క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.