Nuwanidu Fernando : శ్రీలంక ఓపెనర్ నువనిదు ఫెర్నాండో అరుదైన ఘనత సాధించాడు. భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో ఆరంగ్రేటం చేసిన అతను తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దాంతో ఆడుతున్న మొదటి మ్యాచ్లోనే అర్థ శతకం చేసిన ఆరో శ్రీలంక ఆటగాడిగా ఈ ఓపెనర్ గుర్తింపు సాధించాడు. ఆరంగ్రేటం మ్యాచ్లోనే ఫిఫ్టీ రన్స్ స్కోర్ చేసిన ఐదుగురు శ్రీలంక బ్యాటర్లు ఎవరంటే..
1. అషాన్ ప్రియంజన్- 2003లో పాకిస్థాన్పై 74 రన్స్ కొట్టాడు.
2. చమర సిల్వా – 1999లో ఆస్ట్రేలియాపై 55 రన్స్ చేశాడు.
3. సునీల్ వెత్తిముని – 1975లో ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ (53) సాధించాడు.
4. కుశాల్ మెండిస్ – 2016లో ఐర్లాండ్పై ఫిఫ్టీ (51) రన్స్ బాదాడు.
5. అషెన్ బండారా – 2021లో వెస్టిండీస్పై 50 రన్స్ చేశాడు.
ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన అవకాశాన్ని నువనిదు ఫెర్నాండో అందిపుచ్చుకున్నాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా హాఫ్ సెంచరీ సాధించి జట్టును ఆదుకున్నాడు. 63 బంతుల్లో6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్లో సింగిల్కు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ మెరుపు వేగంతో విసిరిన బంతిని అందుకున్న కేఎల్ రాహుల్ వికెట్లను గిరాటేశాడు. దాంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది.