కామారెడ్డి, జనవరి 9: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి అండర్-17 కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆతిథ్య తెలంగాణ 15 పాయింట్ల తేడాతో విద్యాభారతిపై అద్భుత విజయం సాధించింది. మిగతా మ్యాచ్ల్లో రాజస్థాన్ 9 పాయింట్లతో మధ్యప్రదేశ్పై, ఒడిశా 5 పాయింట్లతో చండీఘడ్పై, ఉత్తరప్రదేశ్ 28 పాయింట్లతో జార్ఖండ్పై, కర్ణాటక 44 పాయింట్లతో జమ్ముకశ్మీర్పై, ఢిల్లీ 8 పాయింట్లతో పాండిచ్చేరిపై, ఢిల్లీ 12 పాయింట్లతో తమిళనాడుపై గెలిచి టోర్నీలో ముందంజ వేశాయి.