హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 26: రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ బాలికల విభాగంలో నల్లగొండ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల 200 మీటర్ల పరుగులో సాయిసంగీత అగ్రస్థానం దక్కించుకోగా.. 800 మీటర్లలో అఖిల చాంపియన్గా నిలిచింది. 400 మీటర్ల హర్డిల్స్లో నిఖిత స్వర్ణం కైవసం చేసుకోగా.. 2 వేల మీటర్ల స్టీపుల్ఛేజ్లో కీర్తన విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన హనుమకొండ జట్టు ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. 200 మీటర్ల పరుగుల హర్షవర్ధన్ పసిడి గెలుచుకోగా.. 800 మీటర్ల పరుగులో శ్రీను అగ్రస్థానం దక్కించుకున్నాడు. టోర్నీ ముగింపు వేడుకల్లో ఆర్యవైశ్య జాతీయ కౌన్సిల్ సభ్యుడు గట్టు మహేశ్బాబు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టాన్లీజోన్స్, పగడాల వెంకటేశ్వర్రెడ్డి, మనోజ్కుమార్, గోపాల్, మారయ్య, సమ్మయ్య, చీఫ్ కోచ్ గౌస్, రతన్బోస్, శ్రీమన్నారాయణ, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.