తిరుమల, జూన్ 6: ఆకాశ గంగ తీర్థం వద్ద ఆంజనేయస్వామివారికి అభిషేకం, పూజలు చేయడం వల్ల లోకంలోని ప్రజలు సుఖ సంతోషాలు,ఆయురాగ్యాలతో ఉంటారని శ్రీపుష్పగిరి మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీవిద్యాశంకరభారతిస్వామిజీతెలిపారు.ఆకాశగంగవద్దటీటీడీనిర్వహిస్తున్నహనుమజ్జయంతివేడుకల్లో భాగంగా మూడవ రోజు ఆదివారం జరిగిన పూజా కార్యక్రమానికి స్వామిజీ విచ్చేశారు.
అనంతరం స్వామిజీ మాట్లాడుతూ లోక శ్రేయస్సు కోసం, ప్రస్తుతం ఉన్న భయానక పరిస్థితులు తగ్గి ఆంజనేయస్వామివారి కటాక్షంతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని టీటీడీ సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పురాణాలు ఆధారంగా తీసుకుంటే తిరుమల క్షేత్రంలోని అంజనాద్రి కొండపై అంజనాదేవి తపస్సు చేసినట్లు తెలుస్తోందన్నారు. పవిత్రమైన ఆకాశ గంగ తీర్థం వద్ద టిటిడి నిర్వహిస్తున్న హనుమజ్జయంతి వేడుకల్లో మూడవ రోజు అంజనాదేవి, బాల ఆంజనేయస్వామివారికి అభిషేకం, గన్నేరు, కనకాంబరం పుష్పాలతో పూజ, అర్చన నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సంతోషాన్ని, శాంతిని కోరుకుంటున్న టిటిడి యాజమాన్యానికి ఆంజనేయస్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలన్నారు.