న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారా షూటింగ్ ప్రపంచకప్లో భారత జోడీ మోనా అగర్వాల్, ఆదిత్య గిరి రజత పతకంతో మెరిసింది. ఆదివారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ (ఎస్హెచ్1) విభాగం ఫైనల్లో మోనా, ఆదిత్య ద్వయం 4-16తో జాంగ్ యిక్సిన్, డాంగ్ చావో (చైనా) చేతిలో ఓటమిపాలైంది. మోనా, ఆదిత్య ఇద్దరు కలిసి 622.9 పాయింట్లు నమోదు చేస్తే.. చైనా జోడీ 627.9 పాయింట్లతో పసిడి కైవసం చేసుకుంది. మరోవైపు మిక్స్డ్ టీమ్ 10మీ ఎయిర్ పిస్టల్ తుది పోరులో మనీశ్ నార్వల్, రుబినా ఫ్రాన్సిస్ జంట 12-16తో లి మిన్, యాంగ్ చావో(చైనా) చేతిలో ఓడి రజతం ఖాతాలో వేసుకుంది. ఇదే విభాగంలో భక్తిశర్మ, రుద్రాంశ్ కండేల్వాల్ జోడీ కాంస్యం దక్కించుకుంది. మిక్స్డ్ టీమ్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్(ఎస్హెచ్2) ఈవెంట్ లో భారత్కు చెందిన పావని బానోతు, సత్య జనార్దన జోడీ కాంస్యం ఖాతా లో వేసుకుంది.