లాహోర్ : స్పాట్ ఫిక్సింగ్ కేసులో జైలుపాలై ఆ తర్వాత కొద్దిరోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమిర్ నాలుగేండ్ల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈనెల 18 నుంచి కివీస్తో జరగాల్సిఉన్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు అతడితో పాటు స్పిన్ ఆల్రౌండర్ ఇమాద్ వసీంలు పాక్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అమిర్ 2020లో, ఇమాద్ 2023లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా ఇటీవలే ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో నిలకడగా ఆడుతూ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సెలక్షన్స్కు అందుబాటులో ఉన్నామని ప్రకటించడంతో సెలక్టర్లు వారికి అవకాశం కల్పించారు. అమిర్ ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నా పాక్ సెలక్టర్లు మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఈ సిరీస్తో పాక్ జట్టుకు బాబర్ ఆజమ్ తిరిగి సారథిగా వ్యవహరించబోతున్న విషయం విదితమే.