హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీకి పయనమయ్యే హైదరాబాద్ క్రికెట్ జట్టులో మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్ జట్టులో ఎంఎల్ఆర్ఐటీకి చెందిన సూర్య తేజ, వినయ్ స్థానం పొందారు. ఎంపికైన విద్యార్థులను ఎంఎల్ఆర్ఐటీ కళాశాల చైర్మన్ లక్ష్మణ్రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్రావు అభినందించారు. ఈ ట్రోఫీకి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) సెలక్షన్ కమిటీ తన్మయ్ అగర్వాల్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.