Virat Kohli – Satya Nadella: ఇటీవలే స్వదేశంలో ముగిసిన వన్డే వరల్డ్ కప్లో భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. కోట్లాది మంది భారతీయ అభిమానులు వరల్డ్కప్లో ఆది నుంచి భారత్కు మద్దతుగా నిలిచారు. సాధారణ ప్రేక్షకులే గాక రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు కూడా కీలక మ్యాచ్లకు తమ పనులను పక్కనబెట్టి మరీ క్రికెట్ మ్యాచ్లను వీక్షించారు. ఈ జాబితాలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ఉన్నారట. వరల్డ్ కప్ మ్యాచ్లను చాలా క్లోజ్గా ఫాలో అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో.. ఫైనల్ మ్యాచ్ లో భారత్ స్కోరు, విరాట్ కోహ్లీ ఎన్ని పరుగులు చేశాడు..? అన్న విషయాలను తన సహచర ఉద్యోగులను పదే పదే అడిగాడట..
గత కొంతకాలంగా Open AI ప్రాజెక్టు మీద చర్చోపచర్చలు సాగిస్తున్న సత్య నాదెళ్ల ఎంత బిజీగా ఉన్న వరల్డ్ కప్ అప్డేట్స్ను మాత్రం మిస్ కాలేదట. ది న్యూయార్కర్ మ్యాగజైన్లో వచ్చిన కథనం మేరకు.. ఓపెన్ ఎఐ కి సంబంధించిన మీటింగ్కు వెళ్లడానికి ముందు, సమావేశం సీరియస్గా జరుగుతున్న క్రమంలో అక్కడి సభ్యుల టెన్షన్ను పోగొట్టడానికి పదే పదే కోహ్లీ ఎన్ని పరుగులు చేశాడు..? ఇండియా స్కోర్ ఎంత..? అని అడిగేవాడట. కొంతమంది క్రికెట్ గురించి అవగాహన లేని వాళ్లు మాత్రం ఇది చూసి అసలు నాదెళ్ల ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అటూ ఇటూ చూసేవారు..
Next time you think your job is more important than cricket, remember that this man had $12 billion on the line and the potential for a very public egg-on-his-face, but that didn’t stop him from updating an uncomprehending audience about Kohli’s batting https://t.co/dSZP9Wn9Dk pic.twitter.com/EPspe36BwU
— Sriram (@sriramin140) December 2, 2023
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని ఆస్ట్రేలియా.. 43 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ టోర్నీలో కోహ్లీ.. 11 మ్యాచ్లు ఆడి 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలున్నాయి.