సిల్హెట్: మహిళల ఆసియాకప్లో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 30 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో) మలేషియాను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్గా బరిలోకి దిగిన తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (53 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్సర్).. అంతర్జాతీయ టీ20ల్లో తొలి అర్ధశతకం నమోదు చేసుకుంది. షఫాలీ వర్మ (46; ఒక ఫోర్, 3 సిక్సర్లు), రిచా ఘోష్ (33 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన మలేషియా 5.2 ఓవర్లలో 16/2తో ఉన్న సమయంలో మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. ఎంతకూ వరుణుడు శాంతించకపోవడంతో డకవర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమ్ఇండియాను విజేతగా ప్రకటించారు. మలేషియా విజయానికి 5.2 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా.. 16 పరుగులకే పరిమితమవడంతో భారత్ అలవోకగా గెలిచింది.