Free Entry To Spectators: భారత క్రికెట్ అభిమానులకు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషేన్ (ఎంసీఏ) శుభవార్త చెప్పింది. త్వరలో భారత మహిళా క్రికెట్ జట్టు ఆడనున్న రెండు కీలక సిరీస్లలో మ్యాచ్లన్నీ స్టేడియాలలో ఫ్రీగా చూసేందుకు అనుమతినిచ్చింది. వచ్చే నెలలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్లూ భారత్తో మూడు ఫార్మాట్ల మ్యాచ్లు ఆడనుండగా ఈ మ్యాచ్లన్నీ ముంబైలోనే జరుగనున్నాయి. ఆ మ్యాచ్లను అభిమానులు ఎలాంటి రుసుము లేకుండానే స్టేడియాలకు వెళ్లి చూసేయొచ్చు.
ఇదే విషయమై ఎంసీఏ సెక్రటరీ అజింక్యా నాయక్ మాట్లాడుతూ.. మహిళా క్రికెట్ను ప్రోత్సహించేందుకు గాను ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే, అపెక్స్ కౌన్సిల్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మేం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం స్టేడియాలు నింపడానికే కాదు.. మహిళా క్రికెట్కు ప్రోత్సాహం అందించడానికి కూడా తోడ్పడుతుంది.. అని తెలిపాడు. డిసెంబర్ 6 నుంచి 10 వరకు భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్తో మూడు టీ20లు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్లు వాంఖడే స్టేడియంలో జరుగుతాయి. అంతేగాక డిసెంబర్ 14 నుంచి 17 దాకా డీవై పాటిల్ స్టేడియం (నవీ ముంబై)లో టెస్టు ఆడనుంది.
A look at the fixtures of #TeamIndia against Australia and England for home season 2023-24 👌👌 pic.twitter.com/p7R2W5a2E0
— BCCI Women (@BCCIWomen) October 27, 2023
ఇంగ్లండ్తో టెస్టులు ముగిసిన వెంటనే భారత్.. ఆస్ట్రేలియాతో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. డిసెంబర్ 21 నుంచి 24 దాకా వాంఖడే వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. 28 నుంచి జనవరి 2 దాకా జరుగబోయే మూడు వన్డేలకూ వాంఖడేనే ఆతిథ్యమివ్వనుంది. జనవరి 5 నుంచి మొదలుకాబోయే టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లు డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతాయి. ఈ రెండు సిరీస్లకు సంబంధించిన మ్యాచ్లు అన్నీ అభిమానులు ఉచితంగా వీక్షించొచ్చు.