న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బర్గోహైకు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అథ్లెట్స్ కమిటీ చైర్పర్సన్గా ఎన్నికైంది. ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ చాంపియన్షిప్ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో లవ్లీనాకు అత్యధిక ఓట్లు వచ్చాయని ఐబీఏ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు భారత్ నుంచి లవ్లీనాతో పాటు బాక్సర్ శివ థాపా సభ్యుడిగా ఎన్నికయ్యాడని తెలిపింది. అధ్యక్షురాలిగా ఎన్నికైన లవ్లీనా ఈ సందర్భంగా స్పందిస్తూ.. ‘ఐబీఏ అథ్లెట్స్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నా. కేవలం సభ్యురాలిగా ఎంపికవుతానని ఊహించా. కానీ కమిటీకి చైర్పర్సన్ అవుతానని ఊహించలేదు. భారతీయ బాక్సింగ్తోపాటు ముఖ్యంగా మహిళల బాక్సింగ్ను ప్రచారం చేసేందుకు అవకాశం లభించింది. బాక్సింగ్ను ప్రోత్సహించేందుకు దక్కిన గొప్ప అవకాశం ఇది’ అని లవ్లీనా ట్వీట్ చేసింది. టోక్యో ఒలింపిక్స్లో మహిళల 65 కిలోల విభాగంలో లవ్లీన కాంస్యం దక్కించుకున్న విషయం తెలిసిందే.