హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు దూసుకెళుతున్నాడు లోకేశ్వర్ చిట్ట. పదకొండేండ్ల వయసులో స్కేటింగ్లో అదరగొడుతున్నాడు. శనివారం నాగారంలోని శ్రీహాస్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలోజరిగిన స్కేటింగ్ టోర్నీలో లోకేశ్వర్ విజేతగా నిలిచాడు. దాదాపు 700 మంది పోటీపడ్డ టోర్నీలో ఈ యువ స్కేటర్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. లోకేశ్వర్ ఇప్పటికే 18 పతకాలు సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.