Jasprit Bumrah : సొంతగడ్డపై భారత జట్టు(Team India) కీలకమైన టెస్టు సిరీస్కు సిద్ధమవుతోంది. 2012లో సిరీస్ను తన్నుకుపోయిన ఇంగ్లండ్ను ఈసారి గట్టి దెబ్బ కొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరో రెండు రోజుల్లో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో బెన్ స్టోక్స్ సేనతో తొలి టెస్టు జరుగనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఇంగ్లండ్ జట్టును హెచ్చరించాడు. ఇంగ్లీష్ ఆటగాళ్లు బాజ్ బాల్(Bazz Ball) ఆటతో తనపై పైచేయి సాధించలేరని స్పీడ్స్టర్ తెలిపాడు.
‘బాజ్ బాల్ ఆటతో చెలరేగుతున్న ఇంగ్లండ్కు అభినందనలు. అయితే.. నేను ఒక బౌలర్గా ఎప్పుడూ పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తాను. వాళ్లు దూకుడుగా ఆడి నన్ను అలసటకు గురి చేయలేరు. ఎందుకంటే వాళ్లకు నేను వికెట్లు పడగొట్టి బదులిస్తాను. మైదానంలోకి దిగిన ప్రతిసారి పరిస్థితులను నాకు అనుకూలంగా ఎలా మలచుకోవాలి అనేదాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను’ అని బుమ్రా వెల్లడించాడు. ఈ స్టార్ పేసర్ ఇప్పటివరకూ టెస్టుల్లో 21.21 సగటుతో 140 వికెట్లు తీశాడు.
జస్ప్రీత్ బుమ్రా
అంతేకాదు నిరుడు బుమ్రా వైస్ కెప్టెన్గా ఉండగా.. ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసింది. 2022లో నిర్వహించిన 2021 ఐదో టెస్టులో జానీ బెయిర్స్టో సెంచరీతో కదం తొక్కాడు. దాంతో, 83-5 దశలో ఉన్న ఇంగ్లండ్ 375 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో, ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు బుమ్రా ఎదురుచూస్తున్నాడు. అయితే.. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలోని ఇంగ్లండ్ తమ వ్యూహాలతో భారత జట్టును ఓడించేందుకు సిద్ధమవుతోంది.