హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)ను ప్రక్షాళన చేయడమే తమ ముందున్న లక్ష్యమని జగన్మోహన్రావు అన్నారు. అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతున్న ఆయన తన విజన్ను ఆవిష్కరించారు. నలభై ఏండ్లుగా హెచ్సీఏలో పేరుకుపోయిన అవినీతిని పారద్రోలేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఇన్నాళ్లు హైదరాబాద్కే పరిమితమైన హెచ్సీఏ కార్యకలాపాలను తెలంగాణలో మిగతా జిల్లాలకు విస్తరిస్తామని అన్నారు. ఈ నెల 20న హెచ్సీఏ ఎన్నికల నేపథ్యంలో జగన్తో నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూ
హెచ్సీఏను అభివృద్ధి చేసేందుకు కచ్చితమైన విజన్తో ఉన్నాం. గత కొన్నేండ్లుగా కొంత మంది వ్యక్తుల చేతుల్లో హెచ్సీఏ బందీగా మారిపోయింది. లెక్కకు మిక్కిలి క్లబ్లను అడ్డుగా పెట్టుకుని రాజకీయాలు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. బహుళ క్లబ్లపై నిషేధంతో కొత్తవారికి అవకాశం లభించనుంది. హెచ్సీఏను అభివృద్ధి చేసేందుకు అందరితో కలిసి ముందుకు వెళ్తాం.
ఈ నెల 20వ తేదీన జరిగే ఎన్నికల్లో మేము స్పష్టమైన మెజారిటీతో గెలువబోతున్నాం. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ తరఫున నేను అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్నాను. మొత్తం 173 మంది సభ్యులు కల్గిన హెచ్సీఏలో 120 ఓట్లతో గెలుస్తామన్న ధీమా ఉంది. మా ప్యానెల్లో అనుభవజ్ఞులైన సభ్యులు ఉండటం కలిసొచ్చే అంశం.
హెచ్సీఏను కేవలం హైదరాబాద్ వరకే పరిమితం చేయకుండా తెలంగాణ తతిమా జిల్లాలకు విస్తరింపజేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. అందుకు తగ్గట్లు వివిధ జిల్లా కేంద్రాల్లో స్టేడియాల నిర్మాణానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటాం.
హెచ్సీఏకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు శతధా ప్రయత్నిస్తాం. అం దుకు పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఎక్కడా పైరేవీలకు తావులేకుండా ప్రతిభకు పెద్దపీట వేస్తాం. నైపుణ్యం ఉన్న గ్రామీణ ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎంపిక విషయంలో లంచాలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తాం.