హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తేతెలంగాణ) ః టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు ప్లేయర్ రజనీకి తగిన ప్రోత్సాహకం లభించింది. విశ్వక్రీడల హాకీలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చడంలో కీలకంగా వ్యవహరించిన గోల్కీపర్ రజినీకి బుధవారం ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రూ.25 లక్షల నజరానా అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. తిరుపతిలో వెయ్యి గజాల నివాస స్థలం, నెలకు రూ.40వేల చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వాలని అధికారులకు జగన్ సూచించారు.