బాకు (అజర్బైజాన్): భారత యువ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా పారిస్ ఒలిపిక్స్ (2024) బెర్త్ దక్కించుకుంది. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో ఐదో స్థానంలో నిలువడం ద్వారా.. సిఫ్ట్ కౌర్ విశ్వక్రీడలకు అర్హత సాధించింది. ఇటీవల ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్లో స్వర్ణం నెగ్గిన 21 ఏండ్ల సిఫ్ట్ కౌర్.. పారిస్ బెర్త్ దక్కించుకున్న ఆరో భారత షూటర్గా నిలిచింది.