IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంతవరకూ ఒక్క ట్రోఫీ కూడా నెగ్గని టీమ్గా ఉన్న పంజాబ్ కింగ్స్ వచ్చే సీజన్కు గాను కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్, గత సీజన్ వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) హెడ్కోచ్గా వ్యవహరించిన సంజయ్ బంగర్ను తమ జట్టుకు హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్మెంట్గా నియమించింది. బంగర్.. 2014 నుంచి 2016 వరకూ పంజాబ్కు హెడ్కోచ్గా సేవలందించిన విషయం తెలిసిందే.
2014 వరకూ పంజాబ్తో పాటు భారత జట్టుకు కూడా బ్యాటింగ్ కోచ్గా పనిచేసిన బంగర్.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో దారుణంగా ఓడిపోయాక బంగర్ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. 2021 సీజన్లో బంగర్ ఆర్సీబీకి బ్యాటింగ్ కన్సల్టెంట్గా బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది ఏకంగా హెడ్కోచ్గా నియమితుడయ్యాడు. కానీ బంగర్ కూడా ఐపీఎల్లో ఆర్సీబీ రాతను మార్చలేదు. దీంతో కొద్దిరోజుల క్రితమే ఆర్సీబీ.. అతడిని హెడ్కోచ్గా తప్పించింది. పంజాబ్కు ప్రస్తుతం ట్రెవర్ బేలిస్ హెడ్కోచ్గా ఉన్నాడు. ట్రైవర్తో కలిసి బంగర్ పంజాబ్ కింగ్స్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేయనున్నాడు.
We are delighted to announce the return of our sher, Sanjay Bangar as the new Head of Cricket Development at Punjab Kings.
Mr. Bangar brings a wealth of experience and expertise to our organization, and we are confident that under his leadership, our cricket development… pic.twitter.com/oDamatwpYg
— Punjab Kings (@PunjabKingsIPL) December 8, 2023
ఇప్పటివరకూ ఐపీఎల్లో ట్రోఫీ నెగ్గని పంజాబ్.. గత సీజన్లో కూడా ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియ (2024)లో పంజాబ్ ఐదుగురు ప్లేయర్లను వేలానికి వదిలేసింది. ఇందులో స్టార్ ఆల్ రౌండర్ షారుక్ ఖాన్ కూడా ఉన్నాడు. పంజాబ్ ఖాతాలో ప్రస్తుతం రూ. 29.1 కోట్ల నగదు ఉంది.