IPL Mega Auction | క్రికెట్ అభిమానులకు కనువిందు చేసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2022) మెగా వేలానికి రంగం సిద్ధమైంది. శనివారం నుంచి రెండ్రోజుల పాటు బెంగళూరు వేదికగా ఈ వేలం జరుగుతుంది. మొత్తం 10 ఫ్రాంచైసీలు ఇప్పటివరకు 33 మంది ప్లేయర్లను సెలెక్ట్ చేసుకున్నాయి. మరో 590 మంది ఆటగాళ్ల నుంచి తమకు అవసరమైన ప్లేయర్లను మెగా వేలంలో సొంతం చేసుకోనున్నాయి. ఇందుకు పది ఫ్రాంచైసీలు రూ.560 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నాఇయ. గరిష్ఠంగా పంజాబ్ కింగ్స్ ఎలెవెన్స్ ఫ్రాంచైసీ వద్ద రూ.72 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద తక్కువగా రూ.47.5 కోట్లున్నాయి.
ప్రతి ఫ్రాంచైసీ జట్టులో గరిష్ఠంగా 25 మంది క్రికెటర్లు ఉండాలి. కొన్ని ఫ్రాంచైసీలు ఇద్దరు.. ముగ్గురు.. నలుగురు ప్లేయర్లను కొనసాగించాలని (రిటైన్) నిర్ణయించుకున్నాయి. మిగతా వారిని వేలంలో సొంతం చేసుకోనున్నాయి. ఆయా ఫ్రాంచైసీలు ఎవరెవరిని సొంతం చేసుకున్నాయి. ఏ ఫ్రాంచైసీ వద్ద ఎంత డబ్బు ఉందన్న సంగతి తెలుసుకుందాం..
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ, ప్లేయర్లు రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్లను రిటైన్ చేసుకుంది. మరో 21 మందిని సొంతం చేసుకోవాల్సిఉంది. ఇందుకు చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.48 కోట్ల నగదు ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా నలుగురు ప్లేయర్లు రిషభ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్జ్లను రిటైన్ చేసుకుంది. మరో 21 మంది క్రికెటర్లను వేలంలో సొంతం చేసుకోవాలి. సంస్థ వద్ద రూ.47.5 కోట్ల సొమ్ము ఉంది. కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు.. ఆండ్రూ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, సునిల్ నరైన్.. కాగా, మరో 21 మంది క్రికెటర్లను సొంతం చేసుకోవాల్సి ఉంది. సంస్థ వద్ద రూ.48 కోట్ల నగదు ఉంది.
ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ఎస్కే యాదవ్, కీరన్ పొలార్డ్లను రిటైన్ చేసుకుంది. సంస్థ వద్ద రూ.48 కోట్ల నగదు ఉంటే, మరో 21 మందిని ఎంచుకోవాల్సి ఉంది. కొత్తగా ఏర్పాటైన ఫ్రాంచైసీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) కూడా కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్లను సొంతం చేసుకోగా, మరో 22 మందిని ఎంపిక చేయాలి. అందుకు సంస్థ రూ.59 కోట్లను కలిగి ఉంది.
ఇక పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ మయాంక్ అగర్వాల్, అర్షదీప్సింగ్లను సొంతం చేసుకున్నది. మరో 23 మందిని వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంది. ఫ్రాంచైసీ వద్ద రూ.72 కోట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కూడా సంజూ శ్యామ్సన్, జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్ ఇప్పటికే రిటైన్ చేసుకున్నది. ఇంకా రూ.62 కోట్ల నిధులు ఉన్న ఆర్ఆర్.. మరో 22 మంది ప్లేయర్లను ఎంచుకోవాలి.
ఇక ఆర్సీబీ విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, మహ్మద్ సిరాజ్లను కొనసాగిస్తున్నది. మరో 22 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఆర్సీబీ వద్ద రూ.57 కోట్ల నిధులు ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైసీ.. కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్లను ఇప్పటికే కలిగి ఉంది. రూ.68 కోట్లతో మరో 22 మంది క్రికెటర్లను ఎంచుకోవాల్సి ఉంది. కొత్త ఫ్రాంచైసీ గుజరాత్ టైటాన్స్.. హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్లను సొంతం చేసుకుంది. రూ.52 కోట్లతో 22 మంది క్రికెటర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.